ప్రధానాంశాలు:
- హెలికాప్టర్ కొనడానికి సాయం చేయాలని రాష్ట్రపతికి లేఖ.
- తన పొలానికి కొందరు వ్యక్తులు దారి మూసేశారని ఆరోపణ.
- సమస్యపై ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖ రాసిన మహిళ.
అదే గ్రామానికి చెందిన రైతు పర్మానంద్ పటిదార్, ఆయన కుమారులు ఆమె పొలానికి వెళ్లే దారిని మూసివేశారు. దీనిపై స్థానిక అధికారులకు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వారి చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోయింది. అంతేకాదు, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ప్రధాని నరేంద్ర మోదీలకు సైతం లేఖ రాసింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
దీంతో ఆవేదనకు గురైన బసంతి బాయి ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. రైతు పర్మానంద్ పటిదార్, ఆయన ఇద్దరు కుమారులు లవ్, కుశ్ తన పొలానికి వెళ్లే మార్గాన్ని మూసివేశారని అందులో ఆరోపించింది. తనకు ఉన్న కొద్దిపాటి భూమే జీవనాధారమని తన పొలానికి వెళ్లే మార్గం లేదని వాపోయింది. అందుకే తాను హెలికాప్టర్లో పొలానికి వెళ్లి సాగు చేసుకుంటానని పేర్కొంది.
హెలికాప్టర్ కొనుగోలుకు అధికారులు ఏర్పాటు చేయాలి లేదా రుణం, సంబంధిత లైసెన్స్ కోసం సహాయం చేయాలని రాష్ట్రపతికి రాసిన ఆ లేఖలో బసంతి బాయి కోరారు. బసంతి బాయి ఆవేదనను ఓ వ్యక్తి టైప్ చేసి, లేఖను రాష్ట్రపతికి పంపారు. కాగా, ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. గురువారం బసంతీ బాయిని కలిసిన రెవెన్యూ అధికారులు.. విచారణ ప్రారంభించారు. అయితే, ఆమెకు అడ్డంకులు సృష్టించినవారిని గుర్తించలేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కాగా, ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ స్పందించారు. ఆ మహిళకు తాను సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, హెలికాప్టర్ కొనడానికి కాదని, ఆమె తన పొలానికి వెళ్లేలా సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.