‘నేను చచ్చిపోతున్నా (ఊపిరి తీసుకోలేకపోతున్నా).. రాష్ట్రంలో హింసను ఆపడానికి ఏం చేయలేకపోతున్నా. నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తోంది. నువ్వు ఇక్కడ కూర్చొని ఏమీ చేయలేకపోతే.. వెంటనే రాజీనామా చేయమని చెబుతోంది’ అని త్రివేది అన్నారు.
స్వామి వివేకానంద మాటలను త్రివేది గుర్తుచేశారు. ‘లేవండి, మేల్కొండి, గమ్యం చేరేంతవరకు విశ్రమించకండి..’ అని వివేకానంద చెప్పారని పేర్కొన్నారు.
రాజీనామా చేసినా పశ్చిమ బెంగాల్ ప్రజల సేవలోనే ఉంటానని త్రివేది చెప్పారు. ఆయన బీజేపీ పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు వివిధ అంశాలపై ప్రసంగించిన త్రివేది ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. కరోనా సంక్షోభ సమయంలో చాలా బాగా పనిచేశారని.. దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు.