ఆ పాపకు ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే, రెండో చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నవజాత శిశువు కోసం గాలించడంతో తంజావూరు కోట చుట్టూ తవ్విన కందకంలో పాప మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. మరో చిన్నారిని అదే ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో పెట్టారు. ఇక, చనిపోయిన చిన్నారి ఒంటిపైగానీ, బతికున్న చిన్నారి ఒంటిపైనగానీ కోతి గోటి ఆనవాళ్లే లేవని డాక్టర్ చెప్పారు.
పిల్లలను కోతుల్లాంటి జంతువులు ఎత్తుకెళ్లినప్పుడు పిల్లల కీళ్లు పట్టుదప్పే అవకాశం ఉందని, కానీ, అలాంటి జరగలేదని అంటున్నారు. వారి ఒంటి మీద ఒక్క గాయం గుర్తు కూడా లేదని చెప్పారు. అంతేకాదు, కోతులు పైకప్పు పెంకులను తొలగించి, ఇంట్లోకి దూరి పిల్లలను ఎత్తుకుని, మళ్లీ ఆ రంధ్రంలో నుంచే వెళ్లడం అసాధ్యమని తంజావూర్ ఫారెస్ట్ రేంజర్ జి. జోతికుమార్ పేర్కొన్నారు. దీంతో తల్లిదండ్రులపైనే అనుమానం వ్యక్తమవుతోంది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో వారు ఈ నాటకమాడుతున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ప్రాంతంలో నాలుగైదు కోతులు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని తంజావూర్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఇళయరాజా అన్నారు. ‘జంతువులు ఇంటి పైకప్పులు తొలగించి లోనికి ప్రవేశించి, మళ్లీ అదే మార్గంలో రావడం అసాధ్యమం.. చిన్నారులకు ఎటువంటి గాయాల కాలేదని వైద్యులు చెబుతున్నారు.. కాబట్టి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను తెలుసుకుంటాం’ అని వ్యాఖ్యానించారు.