రచయిత మీనా అయ్యర్తో కలిసి సోనూ సూద్ రచించిన ఈ పుస్తకాన్ని ఈ నెల మొదట్లో విడుదల చేశారు. ఈ పుస్తకం చదివిన మౌని రాయ్, తుషార్ కపూర్, అపర్శక్తి ఖురానా, రాజ్కుమార్ రావు లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ సోనూ సూద్ను అభినందించారు. అయితే, ఈ పుస్తకాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్న సోనూ సూద్.. ఆ సినిమా సెట్లోనే చిరంజీవికి తన పుస్తకాన్ని అందజేశారు సోనూ. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనూపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘ఐ యామ్ నో మెస్సియా పుస్తకాన్ని అందించిన సోనూ సూద్కు అభినందనలు. హీరోలు పుట్టరు, తయారవుతారని మీరు మరోసారి నిరూపించారు. సరైన సమయంలో మీరు అద్భుతంగా స్పందించి కొన్ని వేల మంది ప్రజలను ఆదుకున్నారు. మీ ప్రయాణం కచ్చితంగా స్ఫూర్తిదాయకం’’ అని చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.
చిరంజీవి ట్వీట్కు సోనూ సూద్ స్పందించారు. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ‘యు ఆర్ ద బెస్ట్’ అని మాత్రం చెప్పగలను. మీరు ఈ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరవాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కోసం వేచి చూస్తున్నాను. హాయిగా చదవండి. లవ్ యు సార్’’ అని చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్నారు సోనూ సూద్.