ప్రధానాంశాలు:
- రోహిత్ మిట్టల్ని ప్రేమించి పెళ్లాడిన శ్వేతా బసు
- పెళ్లైన ఎనిమిది నెలలకే బ్రేకప్
- ఇప్పుడే హ్యాపీగా ఉందంటున్న హీరోయిన్
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు.. రోహిత్ మిట్టల్ అనే బాలీవుడ్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. కాగా చాలాకాలంగా సినిమాలకు దూరమైన ఆమె, తిరిగి కెమెరా ముందు బిజీ కావాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది.
జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నానని చెప్పిన శ్వేతా బసు ప్రసాద్.. తన వైవాహిక జీవితం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని ఊహించలేదని చెప్పింది. కాకపోతే ఇప్పుడే స్వేచ్ఛగా ఉందని, భర్తతో విడిపోయాకే అసలైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓపెన్ అయింది. తాము విడాకులు తీసుకున్నామనే పెద్దపెద్ద పదాలు వద్దని, అది జస్ట్ బ్రేకప్ అంతే అని శ్వేతా బసు తెలపడం విశేషం.
ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ చేస్తున్న మూవీ `ఇండియా లాక్డౌన్`. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ పాత్రలో రియాలిటీగా కనిపించాలనే టార్గెట్ పెట్టుకొని ఇటీవలే ముంబై రెడ్లైట్ ఏరియాను కూడా సందర్శించింది ఈ హీరోయిన్.