ప్రధానాంశాలు:
- గుజరాత్లో రిలయన్స్ జూ పార్క్
- ప్రపంచంలోనే మరెక్కడా లేని రీతిలో..
- అంబానీ కుమారుడి కలల ప్రాజెక్ట్
ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కలల ప్రాజెక్ట్గా దీన్ని చెబుతున్నారు. రిలయన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా.. వన్య ప్రాణులకు ఆవాసం కల్పించడం కోసం గుజరాత్ అటవీ శాఖకు సహకరించడం కోసం కూడా ఈ ప్రాజెక్ట్ తోడ్పడనుంది. వచ్చే రెండేళ్లలో ఈ పార్కు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
రిలయన్స్ ఏర్పాటు చేయబోయే జూలో ప్రపంచం నలుమూలల నుంచి.. 100కిపైగా రకాల భిన్న జాతుల పక్షులు, సరీసృపాలు, జంతువులను తీసుకొచ్చి ఉంచనున్నారు. ఎలుగుబంట్లు, కొమోడో డ్రాగన్లు, తోడేళ్లు, పెలికాన్లు, అరిచే జింకలు.. తదితర జంతువులను ఈ జంతు ప్రదర్శనశాలలో ఉంచనున్నారు. చిరుతలు, జిరాఫీలు, ఏనుగులు, ఆఫ్రికా సింహాలు, నిప్పు కోడి తదితర వన్య ప్రాణులను ఈ జూలో ఉంచుతారు.
ఇప్పటికే గుజరాత్లోని కెవాడియాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం (పటేల్ విగ్రహం) ఉంది. త్వరలోనే ప్రపంచంకెల్లా అతిపెద్ద జూ సైతం ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు కానుంది. ఈ జూ కారణంగా గుజరాత్కు భారీగా పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.