ఆలయ ఆదాయంపై కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా ఉందని, విరాళాలు తగ్గిపోయాయని తెలిపింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి తమకు కొంత సమయం కావాలని కోరింది.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ సమయంలో ఎటువంటి ఆదేశాలను జారీచేయలేమని పేర్కొంది. ఈ అభ్యర్థను కేరళ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆదేశించింది. ఆలయ ఆదాయ వ్యయాల ఖాతాల ఆడిటింగ్ సెప్టెంబరు మధ్యలో ప్రారంభించాలని ఈ మేరకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం స్పష్టం చేసింది.
పద్మనాభస్వామి ఆలయ పాలన బాధ్యతను రాజకుటుంబానికి అప్పగించడాన్ని గతేడాది జులైలో ఇచ్చిన తీర్పులోనే సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆలయంపై రాజ కుటుంబం హక్కులు సరైనవేనని పేర్కొంది. ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. 1991లో ట్రావెన్కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దుచేసింది.
కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చి నుంచి ఆగస్టు 26 వరకు అనంతపద్మనాభస్వామి ఆలయం మూసివేశారు. తిరిగి ఆలయాన్ని తెరిచినా సిబ్బంది, పూజారులకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అక్టోబరు 12న తిరిగి తాత్కాలికంగా మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.