యూకే నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో డిసెంబరు 16న కోవిడ్ లక్షణాలు కనిపించడంతో స్థానికంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో అతడికి పాజిటివ్గా తేలింది.. అప్పటి నుంచి వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి నమూనాలను రెండు రోజుల కిందట సేకరించి సీసీఎంబీకి పంపగా.. కరోనా జీనోమ్ సీక్వెన్స్ విశ్లేషణ పరీక్షల్లో వైరస్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో విజృంభిస్తోన్న వైరస్.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపారు.
కొత్తకరోనా తాజా నిబంధనల ప్రకారం.. యూకే వైరస్ పాజిటివ్గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్ వస్తేనే.. పూర్తిస్థాయిలో దాని ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి వరంగల్ కేసుకు సంబంధించి యూకే వైరస్ ఉన్నట్లుగా గుర్తించడంతో.. ఈ విధానం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. కాగా, ఈ వైరస్ ప్రస్తుత వైరస్తో పోల్చితే 70 శాతం మరింత వేగంగా వ్యాప్తిచెందుతుంది.