కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 313 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు వివరాలు తెలిపింది. వీరిలో 162 మంది డాక్టర్లు ఉన్నట్లు తెలిపింది. కొవిడ్ కారణంగా 107 మంది నర్సులు, 44 మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచిన వైద్య, ఆరోగ్య సిబ్బందికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (PMGKP) కింద పరిహారం అందుతుందని మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు.
కరోనా మహమ్మారితో పోరులో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలచివేసింది. మరోవైపు.. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు లక్షన్నరకు పైగా మృతి చెందారు.