మహిళ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. పరస్పర అవగాహనతోనే భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
మాజీ భర్త కుటుంబసభ్యులు, గ్రామస్థులు గతవారం తన ఇంటికి వచ్చి బలవంతంగా బయటకు తీసుకొచ్చి, అనాగరిక చర్యలకు పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్లో ఇటువంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గత జులైలోనూ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణలతో భర్తను భుజాలపై ఎక్కించి ఊరంతా తిప్పారు. జబువా జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి గుజరాత్కు వలస వెళ్లాడు. ఆ కుటుంబం తర్వాత సొంతూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
అయితే.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త తన కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు చెప్పాడు. దీంతో ఆమెకు శిక్ష విధించారు. రెండేళ్ల కిందట ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయిన గిరిజన మహిళకు పెద్దలు కఠిన శిక్ష విధించారు.