
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఘడియలు దగ్గర పడుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ మరో శుభవార్త అందించారు. తొలి దశలో భాగంగా ఇవ్వనున్న వ్యాక్సిన్ను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. జనవరి 16 నుంచి ప్రారంభం కానునున్న తొలి వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమంలో 3 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకయ్యే ఖర్చునంతా కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని
ప్రధాని మోదీ తెలిపారు.
మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని మోదీ వెల్లడించారు. వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. ఇక రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 50 ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న (50 ఏళ్ల లోపు) వారికి టీకా ఇస్తామని తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాలపై సోమవారం (జనవరి 11) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ భేటీలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. తొలి దశ టీకాల పంపిణీ తర్వాత ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అవుతానని ప్రధాని చెప్పారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని అన్నారు.
Also Read:
✧ కరోనా వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
✧ కరోనా టీకా: కామన్ డౌట్స్ – సమాధానాలు
✧ భారత్ బయోటెక్ నుంచి కొత్త వ్యాక్సిన్.. ముక్కు ద్వారా వేసేది, గేమ్ ఛేంజర్!
Like this:
Like Loading...