ప్రధానాంశాలు:
- వ్యవసాయ రుణాల మాఫీకి నిధులు విడుదల చేసిన సీఎం.
- ఎన్నికల ముందు తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం.
- మరిన్ని కొత్త పథకాలను ప్రారంభించనున్నట్టు ప్రకటన.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చిన ఏకైక పార్టీ అన్నాడీఎంకేయే అన్న ఆయన.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలుచేయనున్నామని తెలిపారు. ప్రతిపక్షం డీఎంకేపై విమర్శలు గుప్పించిన ఆయన.. గతంలో రెండు ఎకరాల పొలం ఇస్తామని హామీ ఇచ్చిన ఆ పార్టీ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యిందని ధ్వజమెత్తారు.
కాగా, ఎన్నికల సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. కమల్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ప్రచారాన్ని ప్రారంభించింది. మరోవైపు, అక్రమాస్తుల కేసులో శిక్ష పూర్తికావడంతో జయలలిత నెచ్చెలి వీకే శశికళ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె కూడా ఎన్నికల్లో పోటీచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అటు అన్నాడీఎంకే- బీజేపీ కలిసి పోటీచేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. కూటమి సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ నేతలు చేసిన ప్రకటనలతో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈసారి తమిళనాట పోరు రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఎలాగైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే దృఢసంకల్పంతో ఉంది.