కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి, యావత్మల్ జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వారాంతాల్లో పూర్తి లాక్డౌన్ విధించారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఫిబ్రవరి 18న కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. స్థానిక బస్సులు, లోకల్ రైళ్లలో ప్రయాణించేవారితో పాటు పని ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అప్పటికప్పుడు జరిమానా విధించి వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఆంక్షల అమలు విషయంలో అధికారులు, సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది.
మధ్యప్రదేశ్లోనూ గత వారం నుంచి కొత్త కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 297 మందికి ఆ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అటు, చత్తీస్గఢ్లోనూ ఇదే పరిస్థితి. కొత్తగా 259 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. మహమ్మారిని నిరోధించి, ఛైన్ను విచ్ఛిన్నం చేయాలని పేర్కొంది.