చైనా తన సరిహద్దుల వెంట చాప కింద నీరులా సైనిక స్థావరాలు, మిస్సైల్ బేస్లను నిర్మించుకుంటోంది. తాజాగా వియత్నం సరిహద్దులో మరో మిస్సైల్ బేస్ నిర్మించినట్లు తెలుస్తోంది. వియత్నాం విదేశాంగ ప్రతినిధి లె థి తూను ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించగా ఆచితూచి స్పందించారు. శాటిలైట్ చిత్రాల్లో వియత్నాం సరిహద్దుకు 20 కి.మీ. దూరంలో మిస్సైల్ బేస్ కనిపిస్తోందని ఆమె తెలిపారు. ఆ నిర్మాణం పూర్తయినట్లు తమకు సమాచారం ఉందని.. ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.