ప్రధానాంశాలు:
- 15 మంది ప్రాణాలు తీసిన పొగమంచు.
- రహదారిపై బోల్తాపడిన ప్రయివేట్ బస్సు.
- కరాచీకి వెళ్తుండగా ఘోర ప్రమాదం.
మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఉతల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వేగంగా వస్తున్న బస్సును డ్రైవర్ నియంత్రించలేకపోవడంతోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అయితే, పొగ మంచ కారణంగా ప్రమాదం జరిగిందని స్థానిక పోలీస్ అధికారులు పేర్కొన్నారు. దట్టంగా మంచు కురవడం వల్ల రహదారి కనిపించక బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని అన్నారు.