పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఆదేశాల మేరకు ఢిల్లీలో సర్దార్ పటేల్ భవన్, అజిత్ దోబాల్ నివాసంతో పాటు ప్రముఖులు ఉండే పలు ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించానని మాలిక్ తెలిపినట్లు సమాచారం. 2019 మేలోనే ఈ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీతో పాటు సాంబా సరిహద్దుల్లోనూ తాను రెక్కీ నిర్వహించానని ఆ ఉగ్రవాది తెలిపాడు. తనతో పాటు మరికొందరు ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్లో ఉన్నట్లు అతడు చెప్పినట్లు సమాచారం.
మాలిక్ ఇచ్చిన సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దోబాల్ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.
కశ్మీర్ భద్రతా వ్యవహారాల్లో అజిత్ దోబాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతా బలగాలకు తగిన సూచనలు ఇస్తున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో పాకిస్థాన్లోని బాలాకోట్పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించడంలో దోబాల్ వ్యూహకర్తగా వ్యవహరించారు.