సభా ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లి వేదికపైకి ఎక్కిన రైతులు.. కుర్చీలు కింద పడేసి, అక్కడ పోస్టర్లను చించేశారు. హెలిప్యాడ్ను ధ్వంసం చేశారు. భద్రతా కారణాలతో ముఖ్యమంత్రి సభను రద్దుచేసుకున్నారు. కైమ్లా గ్రామంలో ‘’ సభను నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.
సీఎం సభను అడ్డుకుంటామని రైతు సంఘాలు ప్రకటించడంతో కైమ్లా గ్రామంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు, మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు, పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేంద్రం, రైతు సంఘాల మధ్య ఎనిమిదిసార్లు చర్చలు జరిగాయి. తదుపరి చర్చలు జనవరి 15న జరగనున్నాయి.
ఢిల్లీలో నిరసన తెలియజేయడానికి వెళ్తున్న పంజాబ్ రైతులను హరియాణా సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బారికేడ్లు, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల సాయంతో రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా కిసాన్ మహాపంచాయత్ను ఏర్పాటుచేశారు.