Also Read:
ఇటీవల రాజశేఖర్ తలపై విగ్ లేని సమయంలో చూసి భార్య షాకైంది. దీంతో ఆమె గట్టిగా నిలదీయడంతో తనకు బట్టతల ఉండటంతో విగ్ ధరిస్తున్నాని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పింది. దీంతో పంచాయతీ పెట్టగా అతడితో కాపురం చేయలేనని ఆమె తెగేసి చెప్పింది. దీనికి తోడు కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలు వాపసు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమెపై దాడికి పాల్పడ్డారు
Also Read:
దీంతో బాధితురాలు భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యాట్రమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైన రాజశేఖర్ విగ్గు పెట్టుకుని మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని, అతడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు రాజశేఖర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.