సోదరుడిని చంపేస్తానని బెదిరించడంతో ఆ టీనేజ్ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. భయంతో తల్లిదండ్రులకు కూడా తన బాధ చెప్పుకోలేకపోయింది. నిందితుడు చెప్పిన చోటకు వెళ్లిపోయింది. ఆ ట్యూటర్ ఆ అమ్మాయిని తీసుకొని ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. ట్యూషన్ కోసం వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ట్యూటర్ ఆమన్పై అనుమానం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఓ పోలీస్ బృందాన్ని పంపించారు. ఢిల్లీ పోలీసుల సాయంతో వారు అక్కడికి చేరుకునే సరికి నిందితుడు ఓ మసీదులో అమ్మాయి మతం మార్పించే పనిలో ఉన్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని వారిద్దరినీ మీరట్ తీసుకొచ్చారు.
నిందితుడిపై కిడ్నాప్, బలవంతంగా మతం మార్పిడి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని త్వరలో కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.
కరోనా సంక్షోభంతో చదువులు ప్రమాదంలో పడ్డాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రైవేట్ ట్యూటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు. కాబట్టి ఆయా వ్యక్తుల నేపథ్యం, కుటుంబ వివరాలు తెలుసుకొని అడుగు వేయడం ఉత్తమం.